భక్తులకు ముఖ్యగమనిక.. చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను మూసివేయనున్నారు. చార్ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్ర ప్రతి సంవత్సరం వేసవికాలంలో మొదలయ్యి శీతాకాలంలో ముగుస్తోంది. ఏడాదిలో ఆరు మాసాల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఉంటుంది. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం వల్ల శీతాకాలంలో మంచు తీవ్రత దృష్ట్యా ఈ యాత్రలను నిలిపివేస్తారు. తాజాగా ఆలయ కమిటీ ఈ సంవత్సరానికిగాను ఛార్ధామ్ యాత్ర ముగింపు తేదీలను ప్రకటించేసింది.