Tirumala News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ నెల 8,9 తేదీలలో ఆ సేవలు రద్దు..

పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా సేవలందించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.

తిరుమలలో పుష్పయాగ మహోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న, శనివారం, పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. నవంబరు 8న, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ జరగనుంది. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేష అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು