HD Deve Gowda : బాబా బైద్యనాథ్ను దర్శించుకున్నారు మాజీ ప్రధాని దేవగౌడ. జార్ఖండ్లోని దేవఘడ్లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆయన ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి జలాభిషేకం చేసి, పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ ప్రధాని రాక సందర్భంగా దేవఘడ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దేవఘడ్: జార్ఖండ్లోని దేవఘడ్లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యానాథ్ ఆలయాన్ని ఇవాళ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవ గౌడ(HD Deve Gowda ) దర్శించుకున్నారు. ఆలయంలోని పూజారులు ఆయన చేత పూజలు నిర్వహించారు. వైదిక మంత్రాలను చదివించారు. సంకల్పం చేయించారు. గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగ స్వరూపుడైన బైద్యనాథుడికి .. దేవగౌడ జలాభిషేకం నిర్వహించారు.
ఆయన నుదిటిపై భస్మాన్ని ధరించి, మంగళ దీవెనులు ఇచ్చారు. మాజీ ప్రధాని దేవగౌడ రాక సందర్భంగా జిల్లా ఎస్పీ విశాల్ సాగర్ భద్రతా ఏర్పాట్లు చేశారు. మాజీ ప్రధాని ఇవాళ ఉదయం దేవఘర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బైద్యనాథుడి రూపంలో దర్శనం ఇస్తున్న శివలింగానికి అభిషేకం చేసిన వీడియోను దౌవగౌడ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.